ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పటి జగన్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో ఏక పక్షంగా వెళితే, న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచనలు పాటించలేదని ఎద్దేవా చేసారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తెలిసిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఈ రోజు కొత్తూరు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తప్పుగా నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పోలవరం అథారిటీ దృష్టికి కూడ ఏ విషయం తీసుకెళ్లలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. మరో వైపు బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సైతం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ను విమర్శించారు. టీడీపీ తరహాలోనే జగన్ కూడ మైండ్ గేమ్ ఆడుతున్నారని, విద్యుత్ ఒప్పందాల రద్దు, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ అంశాలు జగన్ స్వయంకృతాపరదామని అన్నారు. విద్యుత్ ఒప్పందాల రద్దు విషయంలో కేంద్రం రాష్ట్రానికి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=8BGVhOM9oZ8]