తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2083 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 31, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 64,786 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 530 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.81% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1114 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 46,502 కి చేరింది. ప్రస్తుతం 17,754 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 71.7 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డిలో 228, మేడ్చల్లో 197, వరంగల్ అర్బన్లో 134, కరీంనగర్ లో 108, సంగారెడ్డిలో 101 కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu