ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. దీంతో వరుసగా మూడో రోజూ కూడా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10376 కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10376 కేసులతో కలిపి జూలై 31, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కేసుల సంఖ్య 140933 కు చేరింది. మరో 3822 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు.
గత 24 గంటల్లో 61699 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన గుంటూరులో పదమూడు మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, కర్నూల్ లో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, కృష్ణాలో ఒకరు, కడపలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1349 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 31, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 19,51,776
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 140933
- కొత్తగా నమోదైనా కేసులు : 10376
- నమోదైన మరణాలు : 68
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 63864
- యాక్టీవ్ కేసులు : 75720
- మొత్తం మరణాల సంఖ్య : 1349
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu