తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1842 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 23, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,06,091 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 6 గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 761 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.71 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 1,825 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 82,411 కి చేరింది. ప్రస్తుతం 22,919 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 77.67 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 373, నిజమాబాద్ జిల్లాలో 158, కరీంనగర్ లో 134, సూర్యాపేటలో 113, రంగారెడ్డిలో 109, సిద్ధిపేటలో 86, ఖమ్మంలో 77, వరంగల్ అర్బన్ లో 74, జగిత్యాలలో 70, మహబూబాబాద్ లో 64, మంచిర్యాలలో 59, సంగారెడ్డిలో 50, వనపర్తిలో 50, నల్గొండ లో 47, పెద్దపల్లిలో 44, మహబూబ్నగర్ లో 42 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu