తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 22, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,249 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. శనివారం నాడు కొత్తగా 2384 కేసులు నమోదవగా, 40,666 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 755 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,586 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,908 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.30% శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.72 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2384):
- జీహెచ్ఎంసీ – 472
- నిజామాబాద్ – 148
- నల్గొండ – 137
- రంగారెడ్డి – 131
- కరీంనగర్ – 120
- సూర్యాపేట – 110
- ఖమ్మం – 105
- జగిత్యాల – 105
- మంచిర్యాల – 90
- వరంగల్ అర్బన్ – 85
- కామారెడ్డి – 69
- జోగులాంబ గద్వాల్ – 68
- సిద్ధిపేట – 67
- పెద్దపల్లి – 65
- సంగారెడ్డి – 61
- మహబూబ్ నగర్ – 61
- భద్రాద్రి కొత్తగూడెం – 52
- మహబూబాబాద్ – 52
- మేడ్చల్ – 52
- వనపర్తి – 47
- రాజన్న సిరిసిల్ల – 42
- జనగామ – 30
- నాగర్ కర్నూల్ – 29
- యాదాద్రి భువనగిరి – 28
- ఆదిలాబాద్ – 25
- మెదక్ – 23
- వరంగల్ రూరల్ – 21
- ములుగు – 19
- వికారాబాద్ – 19
- నిర్మల్ – 19
- నారాయణ్ పేట్ – 13
- ఆసిఫాబాద్ – 12
- జయశంకర్ భూపాలపల్లి – 7
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu