తెలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం మళ్ళీ‌ వాయిదా

Andhra Pradesh, Apex Council Meet Over Water Sharing, Apex Council Meeting, Apex Council meeting between Telangana and Andhra, Apex Council Meeting Between Telugu States, Apex Council Meeting Between Telugu States Postponed, Apex Council Meeting Postponed, telangana

గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఆగస్టు 25న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపించారు.

అపెక్స్‌ కౌన్సిల్‌ కు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఛైర్మన్‌గా, మరియు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆగస్టు 20న గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సమావేశం సెప్టెంబరులో జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − four =