సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగదాంపల్లి 9వ వార్డులో ఆగస్టు 24, సోమవారం నాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని మంత్రి పిలుపునిచ్చారు. స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. స్టీల్ బ్యాంకు సామాగ్రి కిరాయి, సమగ్ర పట్టిక వివరాల పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. ముందుగా 9వ వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు, అదే విధంగా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెడ్డి సంఘ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu