ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం మంత్రి హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 3,53,111 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu