తెలంగాణలో కొత్తగా 2734 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

Coronavirus, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2734 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 31, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 9 గురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 836 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.65(< 1%) శాతంగా ఉంది.

ఇక కరోనా నుంచి కొత్తగా 2,325 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 95,162 కి చేరింది. ప్రస్తుతం 31,699 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 74.5 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 347, రంగారెడ్డి జిల్లాలో 212, నల్గొండలో 191, ఖమ్మంలో 161, మేడ్చల్ లో 121, భద్రాద్రి కొత్తగూడెంలో 117, నిజామాబాద్‌ లో 114, వరంగల్‌ అర్బన్‌ లో 112, సిద్దిపేటలో 109, సూర్యాపేటలో 107, కరీంనగర్ ‌లో 106 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu