తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అంశంపై సందిగ్థత నెలకొన్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి టీశాట్, డిజిటల్, టీవీ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి టీ శాట్ టీవీ స్టూడియోలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలుస్తుంది.
ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పాఠ్యంశాల ప్రసారాలు జరుగనున్నాయి. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసే నేపథ్యంలో పాఠాలను సాయంత్రం వేళలో కూడా తిరిగి ప్రసారం చేయనున్నారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన ఏఏ తరగతులకు ఎన్ని సెషన్స్, ఎన్ని గంటలు భోదించాలనే అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu