ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 18,915 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 280 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 44, అనంతపూర్ లో 44, ప్రకాశంలో 40, పశ్చిమగోదావరిలో 38, విశాఖపట్నంలో 34, గుంటూరులో 28 నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14722 కు చేరింది. గత 24 గంటల్లో 496 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 22,98,033కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,709 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,30,66,774 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ