భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో 78,524 పాజిటివ్ కేసులు నమోదవగా, 971 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 8, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 68,35,655 కు, మరణాల సంఖ్య 1,05,526 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 83,011 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 58,27,704 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 85.3 శాతం గానూ, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,02,425 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu