దేశంలో ఇప్పటికే పలు పార్టీల రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలసిన వారంతా ఇతరులతో వేరుగా ఉండి, కరోనా నిబంధనల ప్రోటోకాల్ను అనుసరించాలని కోరుతున్నాను” అని గులాం నబీ ఆజాద్ ట్వీట్ చేశారు. మరోవైపు అక్టోబర్ 16, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,70,469 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu