ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దినేశ్ కార్తీక్ సంచలన ప్రకటన చేశాడు. కెప్టెన్సీ తన బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందని, బ్యాటింగ్పై మరింత శ్రద్ద పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ కార్తీక్ వెల్లడించారు.
దీంతో కేకేఆర్ నూతన కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ ను నియమించినట్టు జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందిస్తూ, దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొన్నారు. అయితే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికి 7 మ్యాచులు ఆడిన కేకేఆర్ జట్టు నాలుగు విజయాలు సాధించి, 8 పాయింట్లు సాధించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu