ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,760 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30620 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 4, కర్నూల్ లో 2, కృష్ణాలో 7, కడపలో 1, గుంటూరులో 9, చిత్తూరులో 11, అనంతపూర్ లో 6, నెల్లూరులో 7, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 4 కేసులు నమోదయ్యాయి.
ఇక కొత్తగా కరోనా వలన కర్నూల్ లో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7162 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 106 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,80,784 కు చేరింది. అలాగే ప్రస్తుతం 814 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 12 నాటికీ ఏపీలో మొత్తం 1,34,84,025 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ