తూర్పుగోదావరి జిల్లాలో అక్టోబర్ 15, మంగళవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డులో వాలీ-సుగ్రీవుల కొండ వద్ద బస్సు అదుపుతప్పి సుమారు 20 అడుగుల పైనుంచి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం నుంచి అన్నవరానికి బయలుదేరిన ఈ బస్సు, మారేడుమిల్లి చేరుకున్న కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్నవారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. అతివేగం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎన్ ఖాన్, సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా తూర్పుగోదావరి జిల్లా రూరల్ ఎస్పీని ఆదేశించారు.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -