మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 8, సోమవారం నాడు కూడా 8744 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,28,471 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52500 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,068 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,77,112 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.21 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.36 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 97637 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 1,69,38,227 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ