దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నెలకున్న కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు గురించి తెలుసుకునేందుకు గత రెండు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా ఫోన్ చేసి చర్చిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ లతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై చర్చించారు. కరోనా కట్టడికి వారు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్ పంపిణీలో అవలంభిస్తున్న విధానాలను తెలుసుకుని ప్రధాని మోదీ సూచనలు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహాయం చేస్తామని, అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ