దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 20 కోట్లకుపైగా (20,76,10,230) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 17, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 18,71,13,705 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు.
ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 2 కోట్లకుపైగా (2,04,96,525) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో దాదాపు 3 లక్షల (2,94,660) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వద్ద 22,70,216, తమిళనాడు వద్ద 14,19,296, మధ్యప్రదేశ్ వద్ద 13,73,783, గుజరాత్ వద్ద 11,25,547, కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ