దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు 26 రోజుల తరువాత 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,81,386 కేసులు, 4106 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,74,390 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే 75.95 శాతం కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 35,16,997 (14.09%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 3,78,741 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,11,74,076 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 84.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.10 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (మే 16 8am–మే 17 8am) :
- మహారాష్ట్ర – 34389
- తమిళనాడు – 33181
- కర్ణాటక – 31531
- కేరళ – 29704
- ఆంధ్రప్రదేశ్ – 24171
- వెస్ట్ బెంగాల్ – 19117
- ఒడిశా – 11732
- ఉత్తరప్రదేశ్ – 10505
- రాజస్థాన్ – 10280
- హర్యానా – 9115
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 974
- కర్ణాటక – 403
- తమిళనాడు – 311
- ఉత్తర్ ప్రదేశ్ – 308
- ఢిల్లీ – 262
- పంజాబ్ – 202
- ఉత్తరాఖండ్ – 188
- రాజస్థాన్ – 156
- వెస్ట్ బెంగాల్ – 147
- ఛత్తీస్ గడ్ – 144
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ