ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మనతో మనం ఎలా సర్దుకుపోవాలి’ అనే అంశంపై మాట్లాడారు. కొంతమంది తామే గొప్పవాళ్లుగా భావిస్తారని, ఇంకొంతమంది నాకు ఏమి రాదని బాధపడుతుంటారని, మరి కొంతమంది ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందనే భ్రమలో ఉంటారని చెప్పారు. అయితే ఎవరి గమ్యాన్ని, గతినైనా మార్చుకునే అవకాశం వారి చేతుల్లోనే ఉంటుందని ఉదాహారణలతో ఈ వీడియోలో వివరించారు. ఎవరిమీద వారికీ నమ్మకం ఉండడం ఎంత అవసరమో, అలాగే తప్పులు సరిదిద్దుకుంటూ జీవితంలో ఎలా విజయం సాధించవచ్చో ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]