ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బుధవారమే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడినట్టు, అలాగే సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్చినట్లుగా వైద్యులు చెప్పారని గవర్నర్ కు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ