తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
కాగా ధర్నా అనంతరం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బృందం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు హరీశ్ రావు, సింగిరెడ్డి,నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, తదితరులు గవర్నర్ ను కలిసి ధాన్యం కొనుగోలు అంశంపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం గవర్నర్ ను కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ