తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం అధికారులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యుడిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలు అని, టీఎస్ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థికభారం మోపడం ఇష్టంలేక తనవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. టీఎస్ఆర్టీసీపై ఆర్థికభారం తగ్గించడానికి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉదారంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, అధికారులు, సూపర్ వైజర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ