తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. గోద్రెజ్ సంస్థ తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో గురువారం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ సమావేశమై ఈ పెట్టుబడులుపై చర్చించారు. ఖమ్మం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం గోద్రెజ్ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “భారతదేశంలోని అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ డెవలపర్లలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్కు స్వాగతం, వారు తెలంగాణలో 30 టీపిహెఛ్ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రకటించారు, 250 కోట్ల రూపాయల పెట్టుబడితో 60 టీపిహెఛ్ వరకు విస్తరించవచ్చు. ఆయిల్పామ్ను ప్రచారం చేయడంలో సీఎం కేసీఆర్ దృష్టి సారించడం సత్ఫలితాలను ఇస్తోంది” అని పేర్కొన్నారు. కాగా 2025-26 వరకు ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంటును పూర్తి స్థాయిలో నడపాలని గోద్రెజ్ సంస్థ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE