తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అమిత్ షా రామంతపూర్ చేరుకొని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని సందర్శించారు. అక్కడ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎన్సిఎఫ్ఎల్)ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం తుక్కు గూడాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమిత్ షా పర్యటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
“వలస పక్షులు అనుకూలమైన ప్రదేశాలను సందర్శిస్తాయి, ఆహారాన్ని ఆస్వాదిస్తాయి, గుడ్లు పెట్టి ఆనందంగా ఎగిరిపోతాయి. ఇది ఒక ప్రతిబింభించే యాదృచ్చికం” అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను మంత్రి హరీశ్ రావు ఈ ట్వీట్ కు జత చేయడంతో పాటుగా ఆకాశంలో పక్షులు వెళ్తున్న ఫోటోను షేర్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF