టెస్టు క్రికెట్లో రిషభ్ పంత్ మరో రికార్డు సాధించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధసెంచరీ చేశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ మరియు అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్గా పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో పంత్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 111 బంతుల్లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 76 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. దీంతో మొత్తం 203 పరుగులతో ఆసియా వెలుపల ఒకే టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ నిలిచాడు.
ఈ క్రమంలో పంత్ 1953లో వెస్టిండీస్పై కింగ్స్టన్లో విజయ్ మంజ్రేకర్ స్కోర్ చేసిన 161 పరుగుల మునుపటి రికార్డును రిషభ్ బద్దలు కొట్టాడు. ఇక పంత్ కు ముందు 1973లో భారత దిగ్గజ ఆటగాడు, మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్పై రెండు ఇన్నింగ్స్లలో వరుసగా సెంచరీ, అర్ద సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులు , రెండో ఇన్నింగ్స్లో 66 పరుగులు చేశాడు ఫరూఖ్. ఇక ఇదే క్రమంలో ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్గా కూడా పంత్ (203) రికార్డు సాధించాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ మొదటి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ