ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టును కర్నూల్ కు తరలించడం, శాసనమండలి రద్దు తదితర అంశాలపై న్యాయశాఖ మంత్రితో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, నందిగం సురేష్, బాలశౌరి ఉన్నారు.
మరోవైపు ఫిబ్రవరి 14, శుక్రవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా తో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ దాదాపు 40 నిముషాలపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసన మండలి రద్దుపై త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలలోనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, మూడురాజధానుల కోసం నిధులు, దిశా చట్టం ఆమోదం, ప్రత్యేక హోదాతో పాటుగా ఏపీకి నిధులు కేటాయింపు తదితర అంశాలపై అమిత్ షాతో చర్చించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఐదు పేజీలతో కూడిన వినతిపత్రాన్ని సీఎం వైఎస్ జగన్ అమిత్ షాకు అందజేశారు.
[subscribe]