తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ 11, మంగళవారం నుంచి ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం కోసం మరమత్తులు, మార్పులపై సిబ్బందికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తుంది.
న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణదశలో ఉన్నందున, ఏడాదికాలానికి సర్ధార్ పటేల్ పటేల్ మార్గ్లో జోధ్పూర్ వంశీయులకు చెందిన బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ కు ఆమోదం రాగానే లీజుకు తీసుకున్న ఈ కార్యాలయం నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈ వీకెండ్ వరకు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అంశంపై చర్చించడం సహా జాతీయ రాజకీయాలపై పలు పార్టీల నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY