తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30, బుధవారం నాటికీ కరోనా పరీక్షలు సంఖ్య 30 లక్షలు దాటింది. బుధవారం నాడు 54,443 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 30,50,444 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 81,957 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 2214 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2214 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,93,600 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఈ వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 1135 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 305, రంగారెడ్డి జిల్లాలో 191, మేడ్చల్ లో 153, నల్గొండలో 149, వరంగల్ అర్బన్ లో 131, కరీంనగర్ లో 106, ఖమ్మంలో 99, భద్రాద్రి కొత్తగూడెంలో 91, సిద్ధిపేటలో 80, సూర్యాపేటలో 68, రాజన్న సిరిసిల్లలో 67, కామారెడ్డిలో 66, నిజామాబాద్ లో 65, మహబూబాబాద్ లో 59 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 30, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 30,50,444
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,93,600
- కొత్తగా నమోదైన కేసులు : 2214
- నమోదైన మరణాలు : 8
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 1,63,407
- కరోనా రికవరీ రేటు: 83.51%
- యాక్టీవ్ కేసులు: 29,058
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 23,702
- మొత్తం మరణాల సంఖ్య : 1135
- కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu