కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ‘భారతదేశానికి జాతీయ భాష లేదు. దేశంలోని ఇతర అధికారిక భాషలలో హిందీ ఒకటి. ఐఐటీలు మరియు కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. భారతీయులకు భాషను ఎంచుకునే హక్కు ఉండాలి. ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
India does NOT have a National language & Hindi is one among the many official languages
To impose Hindi by way of mandating in IITs & central Govt recruitments, NDA Govt is flouting the federal spirit
Indians should have a choice of language & we say No to #HindiImposition pic.twitter.com/IwXDPNSoSO
— KTR (@KTRTRS) October 12, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY