ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్ మధ్య మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ విషయాన్ని ఇరువురూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ, “కొత్త బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను కలవడం ఆనందంగా ఉంది. నా నివాసంలో విందు సందర్భంగా యూకే, భారతదేశం మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై మర్యాదపూర్వక అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం. అలాగే విందులో అతనికి స్పైసీ ఆవకాయ సహా కొన్ని సంప్రదాయ తెలుగు వంటకాలను రుచి చూపించాను” అని పేర్కొన్నారు.
అనంతరం చిరుతో భేటీపై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ స్పందిస్తూ, “ప్రముఖ నటుడు చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉంది. యూకే మరియు అభివృద్ధి చెందుతున్న టాలీవుడ్ పరిశ్రమ మధ్య సహకారం గురించి మేము చర్చించాము. కొన్నేళ్లుగా మరియు కోవిడ్ కాలంలో చేసిన విస్తారమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై అతనిని ప్రశంసించాను. ఈ సంభాషణను కొనసాగించడం కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే మీ అందమైన ఇంటిలో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు మరియు ఇంట్లో చేసిన స్టీమ్ దోసె మరియు ఆవకాయను నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా కాలంగా గుర్తుండిపోయే ప్రత్యేక సాయంత్రం మరియు మీ రక్తదాన కేంద్రాలలో ఒకదానిలో మిమ్మల్ని కలవాలని నేను ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE