రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

Andhra flood, Andhra Pradesh, Andhra Pradesh flood, AP CM YS Jagan, AP News, Ap Political News, Chandrababu Naidu, Chandrababu Naidu AP CM YS Jagan, Chandrababu Naidu On Flood Situation in the State, Chandrababu Naidu Writes Letter to AP CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ మేరకు వరదల అంశంపై సీఎంకు రాసిన లేఖను చంద్రబాబు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. “భారీవర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తి ఉభయ గోదావరి జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు కరోనా, మరోవైపు వరద ముంపుతో ప్రజలకు ఊహించని కష్టాలొచ్చి పడ్డాయి. వందలాది గ్రామాల ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి తాగునీరు,భోజనం, విద్యుత్ వసతులు కల్పించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలను తక్షణమే చేపట్టాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాయడం జరిగింది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =