కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. బుధవారం మధ్యప్రదేశ్లో అడుగు పెట్టిన రాహుల్ పాదయాత్ర రెండో రోజైన గురువారం ఖాండ్వా జిల్లాలోని బోర్గావ్ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఈరోజు భర్త రాబర్ట్ వాద్రా మరియు కుమారుడు రెహాన్ వాద్రాతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా రాహుల్ పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత తొలిసారిగా ప్రియాంక గాంధీ పాల్గొనడం విశేషం. ఈ యాత్రలో పాల్గొనేందుకు ఆమె తన కుటుంబంతో కలిసి బుధవారం రాత్రి ఇండోర్ చేరుకున్నారు.
అలాగే వీరితో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కమల్ నాథ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కూడా గురువారం పాదయాత్రలో రాహుల్తో కలిసి నడిచారు. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ యాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక పాదయాత్ర సందర్భంగా ప్రజలు, అభిమానులు రాహుల్ గాంధీకి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఆయనకు భద్రత కల్పించడానికి రోడ్డుకు ఇరువైపులా తాళ్లు అడ్డు పెడుతున్నారు. బుధవారం సాయంత్రం బుర్హాన్పూర్లోని ట్రాన్స్పోర్ట్ నగర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. కాగా రాహుల్ పాదయాత్ర ఇప్పటికి ఆరు రాష్ట్రాలలో 1470 కి.మీలకు పైగా పూర్తయింది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తి చేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE