దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 200 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 11, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,74,822 కు చేరుకుంది. కాగా కరోనా వలన 4 మరణాలు (మహారాష్ట్రలో 1, కేరళలో రికాంసైల్డ్ 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,658కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు డబుల్ డిజిట్ లో నమోదయ్యాయి.
దేశంలో 3,913 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం 3,913 (0.01%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 303 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,40,251 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 10న 1,30,816 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.13 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE