ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర కార్మిక, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను కేంద్రమంత్రికి వివరించి, ఇంకా అనుమతులు రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రాజెక్టులకు అనుమతులపైనే ఈ భేటీలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. మరోవైపు బుధవారం రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన అంశాలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకెళ్లే అవకాశం ఉంది.
ముందుగా బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటి అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగిందని సీఎం తెలిపారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE