బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మామ (కేటీఆర్ సతీమణి శైలిమ తండ్రి) పాకాల హరినాథ్ రావు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పోందుతుండగా, గురువారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథ్ రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఓరియన్ విల్లాస్లో ఉన్న వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథ్ రావు భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ దంపతులు ఓదార్చారు. హరినాథ్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ కూడా హరినాథ్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE