ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కూడా గవర్నర్ కలువనున్నారు.
అలాగే ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గవర్నర్ అబ్దుల్ నజీర్ భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అబ్దుల్ నజీర్ తో కూడా గవర్నర్ సమావేశం కానున్నారు. ముందుగా ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ కు విమానాశ్రయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్ స్వాగతం పలికారు. ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పలువురు ప్రముఖులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE