వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. వరంగల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం, ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అలాగే తన పాదయాత్రకు కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని ఫిర్యాదు చేశారు. కాగా గవర్నర్తో సమావేశం అనంతరం నిమ్స్లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని షర్మిల పరామర్శించనున్నారు. ఇక అనంతరం రాజ్భవన్ వెలుపల వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘తెలంగాణలో వాస్తవ పరిస్థితులను తెలియజేసేందుకే గవర్నర్ను కలిశా. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ విషయాలన్నీ గవర్నర్ తమిళిసై దృష్టికి తెచ్చి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేలా చర్యలు తీసుకోవాలని కోరా. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు దాడి చేసి పసి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయంటే కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు నన్ను వారి పార్టీ నేతలతో తిత్తిస్తున్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం ప్రతిపక్షాలకు లేదు. అందుకే త్వరలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నాం’ అని షర్మిల తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE