ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి ఏపీకి చేరుకోనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. అశాస్త్రీయ విభజన వల్ల ఏపీకి ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ నష్టాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన వాటి ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సంస్థలను, అందాల్సిన నిధులను త్వరితగతిన ఇవ్వాలని కోరారు.
ఇక రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి సంబంధించి అనేక అంశాలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, వీటిపై వెంటనే దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు మేరకు నిధులను అందించాలని, ఇంకా రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ వెంటనే విడుదలయ్యేలా చూడాలని హోంమంత్రి అమిత్ షాను సీఎం జగన్ కోరారు. ఇక జాతీయ ఆహార భద్రత లబ్ధిదారుల ఎంపికలో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని, నీతి ఆయోగ్ సూచించిన మేరకు రాష్ట్రానికి రేషన్ కేటాయింపులు చేయాలని సీఎం జగన్ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE