దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు భారత ప్రభుత్వంతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేలో జరగాల్సిన సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) కోర్సులకు సంబంధించిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2వ తేదీ నుంచి 18 వరకూ పరీక్షలు జరగాల్సి ఉండగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పరీక్షలను రీ–షెడ్యూల్ చేస్తున్నట్టు మార్చ్ 27, శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించింది.
ఐసీఏఐ ప్రకటించిన పరీక్షల రీ–షెడ్యూల్ తేదీలు:
సీఏ ఫౌండేషన్ పరీక్ష (కొత్త షెడ్యూల్) : జూన్ 27, 29, జూలై 1, జూలై 3
ఇంటర్మీడియట్ (ఐపీసీ) పరీక్ష 2020 (పాత విధానం) :
గ్రూప్ -1: జూన్ 20, 22, 24 & 26
గ్రూప్ -2: జూన్ 26, 28 మరియు జూలై 2
ఇంటర్మీడియట్ (ఐపీసీ) పరీక్ష 2020 (కొత్త విధానం) :
గ్రూప్ -1: జూన్ 20, 22, 24, 26
గ్రూప్ -2: జూన్ 28, 30; జూలై 2, 4 2020
సీఏ ఫైనల్ పరీక్ష 2020 (పాత విధానం) :
గ్రూప్ –ఐ: జూన్ 19, 21, 23, 25
గ్రూప్ -II: జూన్ 27, 29; జూలై 1, 3
సీఏ ఫైనల్ పరీక్ష 2020 (కొత్త విధానం) :
గ్రూప్ -I: జూన్ 19, 21, 23, 25
గ్రూప్ -II: జూన్ 27, 29; జూలై 1, 3
ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పార్ట్-1 పరీక్ష 2020 :
గ్రూప్ – ఏ: జూన్ 20, 22
గ్రూప్ – బి: జూన్ 24, 26
ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ – అసెస్మెంట్ టెస్ట్ 2020 :
జూన్ 27, 29