ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్ – bse.ap.gov.inలో తనిఖీ చేసుకోవచ్చని ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచించింది. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో, నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరిక్షలు నిర్వహిస్తామని, వీటికోసం మే 17లోపు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు.
కాగా ఏప్రిల్ 19 – ఏప్రిల్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించామని, రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అతి తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది పదో తరగతి ఫలితాలు 28 రోజుల్లో విడుదల చేశామని, ఈ ఏడాది మాత్రం కేవలం 18 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది ఎక్కడా ఏవిధమైన లీకేజ్ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3.349 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మంచి 18వ తేదీ వరకు నిర్వహించామని గుర్తుచేసిన ఆయన.. పరీక్షలకు మొత్తం 6,05,052 మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 3,09,245 మంది బాలురు కాగా, 2,95,807 మంది బాలికలని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE