లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పలు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మే 1, శుక్రవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు మరియు ఇతరులు, రైల్వే మంత్రిత్వ శాఖ నడిపే ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలు చేరుకునేందుకు అనుమతించింది.
ప్రజలను తరలించేందుకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలతో సమన్వయం చేసుకునేలా, రైల్వే మంత్రిత్వ శాఖ నోడల్ అధికారులను నియమించనుంది. టిక్కెట్ల విక్రయాలపై సంపూర్ణ మార్గదర్శకాలు విడుదల చేయనుంది. రైళ్లలో, ఫ్లాట్ఫారాలపైనా సామాజిక దూరం, ఇతర ఆరోగ్యపర జాగ్రత్తలు పాటించేలా కూడా మార్గదర్శకాలు జారీచేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్ లోని హతియాకు 1225 మంది వలస కూలీలతో ప్రత్యేక రైలు ఈ రోజు ఉదయం బయలుదేరింది. ఇక అలూవా నుండి భువనేశ్వర్, నాసిక్ నుండి లక్నో, నాసిక్ నుండి భోపాల్, జైపూర్ నుండి పాట్నా, కోటా నుండి హతియాకు కూడా 6 శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు.
Movement of migrant workers, pilgrims, tourists, students & other persons, stranded at different places, is also allowed by #SpecialTrains to be operated by @RailMinIndia. MoR to designate nodal officer(s) for coordinating with States/ UTs for their movement#lockdown #Covid_19 pic.twitter.com/UvEvDH1Ibj
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]