భారత్ లో ఇప్పటి వరకు పరీక్షించిన కరోనా శాంపిల్స్ సంఖ్య 1.5 కోట్లు (1,54,28,170) దాటింది. గత 24 గంటల్లోనే 3,52,801 శాంపిల్స్ ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం దేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 11,179.3 మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీట్మెంట్ వ్యూహాన్ని అమలు చేయడం వల్ల పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెప్పారు. అలాగే కరోనా పరీక్షల ల్యాబ్ ల సంఖ్య 1290 కి పెరిగింది.
మరోవైపు దేశంలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ కోలుకుంటున్న బాధితుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో అత్యధిక సంఖ్యలో 34,602 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అవుతున్నారు. దీంతో కరోనా నుండి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 8,17,208 కి చేరింది. అలాగే రికవరీ రేటు 63.45 శాతానికి పెరిగింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu