కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత లాక్డౌన్ మరో రెండు రోజుల్లో అనగా మే 3 తేదీతో ముగియనుండటంతో మే 4 నుంచి మే 17 వ తేదీవరకు మళ్ళీ లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మే 2, శనివారం నాడు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేయనున్నారు.
వరుసగా మూడోసారి లాక్డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్స్ ప్రాంతాలకు గణనీయమైన మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఈసారి కూడా జోన్స్ తో ఎలాంటి సంబంధం లేకుండా విమానయాన, రైల్వే, బస్సులు, మెట్రో, ఇతర రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా వ్యవహారాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. మరోవైపు సామర్ధ్యం ఎక్కువుగా ఉండే స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియోటర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మరియు బార్బర్ షాప్స్, సెలూన్స్ పై కూడా నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. సాంస్కృతిక, క్రీడా, రాజకీయ, సామూహిక మతపరమైన సమావేశాలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
New Guidelines for #Lockdown3 measures to fight #Covid_19 👇 pic.twitter.com/zGHwHa65bx
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 1, 2020
National Directives for #Covid_19 Management and penalties for violations of #Lockdown3 measures 👇 pic.twitter.com/G3WvFj6hjh
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu