విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టర్ వినయ్చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా కు ఫోన్ చేసి తాజా పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరికొద్ది సేపట్లో విశాఖకు చేరుకొని ఘటనాస్థలంలో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా సీఎం పరామర్శించనున్నారు. మరోవైపు రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లుగా సమాచారం. అలాగే దాదాపు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]