విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని ప్రధాని మోదీ ట్విట్టర్ లో తెలిపారు. బాధితులకు సహాయ చర్యలను వేగవంతం చేయాలని, ఘటనలో అస్వస్థతకు గురైన వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు. తదుపరి సమాచారం కోసం జాతీయ విపత్తు నివారణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యి, జరుగుతున్న సహాయ చర్యలు, బాధితుల వైద్య సదుపాయాలపై సమీక్ష చేపట్టారు.
మరోవైపు విశాఖ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేసి ప్రధాని మోదీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల వివరాలను ప్రధాని మోదీకి సీఎం వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, తదితరులు స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు రకాల సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
Spoke to officials of MHA and NDMA regarding the situation in Visakhapatnam, which is being monitored closely.
I pray for everyone’s safety and well-being in Visakhapatnam.
— Narendra Modi (@narendramodi) May 7, 2020
ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డితో మాట్లాడాను. ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి చెప్పారు.
— Vice President of India (@VPSecretariat) May 7, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]