లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు ప్రత్యేక రైళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే లాక్డౌన్ వలన వేరే రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలు, విద్యార్ధులు, యాత్రీకులు కూడా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి తిరిగి ఏపీ కి వచ్చే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా మార్గదర్శకాలు/నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రకటించారు.
ఇతర రాష్ట్రాల నుండి తిరిగి ఏపీ కి వచ్చే ప్రజలు పాటించాల్సిన నిబంధనలు:
- రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ నుంచి జారీ చేయబడ్డ ఎంట్రీ పాస్ చూపించాలి.
- శ్రామిక రైళ్ల ద్వారా రైల్వే స్టేషన్లకు చేరుకుంటే ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఆ రాష్ట్రం జారీచేసిన అనుమతి పత్రం చూపించాలి.
- రాష్ట్రంలోకి ప్రవేశించగానే “ఆరోగ్యసేతు యాప్” డౌన్ లోడ్ చేసుకొని, వివరాలు నమోదు చేసుకోవాలి.
- అనంతరం ప్రభుత్వ నియమాల ప్రకారం వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ చేయబడతాయి.
కోవిడ్-19 (కరోనా వైరస్) లక్షణాలుంటే:
–>చెక్ పాయింట్ కు దగ్గర్లో ఉన్న కోవిడ్ సెంటర్ లో క్వారంటైన్ కోసం తరలిస్తారు.
–>పాజిటివ్ గా తేలితే దగ్గరలోని కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తారు.
–>నెగటివ్ గా తేలితే 14 రోజులపాటు క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తారు.
కోవిడ్-19 (కరోనా వైరస్) లక్షణాలు లేకుంటే:
–>చెరగని సిరాతో చేతిపై ముద్ర వేసి, వెళ్లే జిల్లాల ఆధారంగా 100 సమూహంగా విభజించబడతారు.
–>ప్రతి 100 మంది సమూహాన్ని నోడల్ అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళతారు.
జిల్లా హెడ్ క్వార్టర్స్ లో:
–>రిసెప్షన్ కేంద్రాల్లో నివేదించాక, పోర్టల్ లో డేటా ఎంటర్ చేస్తారు.
–>జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన విధంగా 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తారు.
–>14 రోజుల తర్వాత పరీక్ష చేసి లక్షణాలు లేకుంటే ఇంటికి పంపిస్తారు.
ఇంటికెళ్ళాక:
–>మరో 14 రోజుల పాటు ఏఎన్ఎం, ఆశావర్కర్ల పర్యవేక్షణలో ఉంచుతారు.
People coming back to AP from other states should strictly adhere to following guidelines #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ZgDl1p1F7N
— ArogyaAndhra (@ArogyaAndhra) May 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu