ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో మంగళవారం నాడు కొత్తగా 9652 పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 2820 కి పెరిగింది. మరో 9211 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 55692 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో పద్నాలుగు మంది, ప్రకాశంలో పదకొండు మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కర్నూల్ లో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2820 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 18, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 29,61,611
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 3,06,261
- కొత్తగా నమోదైనా కేసులు : 9652
- నమోదైన మరణాలు : 88
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 2,18,311
- యాక్టీవ్ కేసులు : 85130
- మొత్తం మరణాల సంఖ్య : 2820
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu