టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా గతకొన్ని రోజులుగా తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన సంగతి తెల్సిందే. కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరారు. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ కు అనుమతించడంతో ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టారు. ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించేందుకు విశాఖలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన వాయిదా పడడంతో నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.
ముందుగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు విశాఖ పట్నం వెళ్లాల్సి ఉండగా, ఏపీలో దేశీయ విమాన సేవలు ప్రారంభం రెండు రోజులపాటు వాయిదా పడడంతో ఆయన అక్కడికి వెళ్లలేకపోయారు. మరోవైపు మే 27, 28వ తేదీల్లో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమాలకు అమరావతి పార్టీ కార్యాలయం నుంచే హాజరయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయం నుంచే మహానాడు సందర్భంగా పార్టీశ్రేణులకు ఆయన సందేశం ఇవ్వనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu